Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సర్వదర్శనం క్యూలైన్‌లో పాము.. పరుగులు తీసిన భక్తులు

సర్వదర్శనం క్యూలైన్‌లో పాము.. పరుగులు తీసిన భక్తులు
, శుక్రవారం, 20 మే 2016 (11:46 IST)
తిరుమల శ్రీవారి సర్వదర్శన క్యూలైన్లలోకి పాము ప్రవేశించింది. దీన్ని చూసిన భక్తులను భయాందోళనకు గురయ్యారు. ఎంబిసి 34 వద్దగల ఉచిత దర్శనం క్యూలైన్‌లో పాము ఉన్నట్లుండి ప్రవేశించింది. భక్తుల కాళ్ళ మధ్య దూరడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఒకరిని ఒకరు తోసుకుంటూ భక్తులు క్యూలైన్‌లో పరుగులు తీశారు. 
 
కొద్దిసేపు క్యూలైన్‌లోనే సేదతీరిన పాము ఆ తరువాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. భక్తులు తితిదే సిబ్బందికి సమాచారం తెలుపగా వారు  వచ్చే లోపు పాము అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పక్కనే ఉన్న అటవీ ప్రాంతం నుంచి పాము క్యూలైన్‌లోకి వచ్చి ఉంటుందని తితిదే సిబ్బంది భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం: ఎంకే స్టాలిన్‌