Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తితిదేకు భక్తుడు రూ. 300 కోట్ల భారీ విరాళం

తితిదేకు భక్తుడు రూ. 300 కోట్ల భారీ విరాళం
, శుక్రవారం, 12 మార్చి 2021 (16:17 IST)
ఆపద మొక్కులవాడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి పేదల దగ్గర్నుంచి ధనికుల వరకూ కానుకల రూపంలో తమ మొక్కులు చెల్లించుకుంటూ వుంటారు. లాక్ డౌన్ సడలించిన తర్వాత శ్రీనివాసుడుని దర్శించుకుంటున్న భక్తులు కానుకలను సమర్పించుకుంటున్నారు.
 
తాజాగా ఓ భక్తుడు తితిదేకి రూ. 300 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించినట్లు తెలుస్తోంది. తితిదే పరిధిలో నిర్మించ తలపెట్టిన ఆసుపత్రి నిర్మాణానికి అయ్యే రూ. 300 కోట్ల మొత్తం ఖర్చును తనే భరిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.
 
ఇకపోతే ఇటీవలే ఓ తమిళ భక్తుడు ఒకడు కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామికి కోట్లాది రూపాయల విలువే చేసే శంఖుచక్రాలను కానుకగా సమర్పించారు. ఈ శంఖు, చక్రం విలువ రెండు కోట్ల రూపాయలు. వీటిని తమిళనాడుకు చెందిన భక్తుడు సమర్పించారు.
 
ఆ భక్తుడి పేరు తంగదొరు. తేనె జిల్లాకు చెందిన తంగదొరై పరమ స్వామి భక్తుడు. మూడున్నర కిలోల బంగారంతో శ్రీవారికి శంఖు, చక్రాలు చేయించారు. ఇందుకోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు చెప్పారు. వీటిని బుధవారం ఉదయం టీటీడీ అదనపు ఈవోకు అందజేశారు. కాగా, తంగదొరై గతంలోనూ శ్రీవారికి బంగారు, వజ్రాభరణాలను విరాళంగా ఇచ్చారు. అందులో బంగారు కటి, వరద హస్తాలు, వడ్డాణం, వజ్రాభరణాలు ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తరాంధ్రలో భగభగమంటున్న భానుడు, 40 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రత