Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంచు కొండచరియలు విరిగిపడి.. 14జవాన్లు మృతి.. తెలుగు సైనికుడు కూడా?

విపరీతంగా కురుస్తున్న మంచు సైనికులను పొట్టనబెట్టుకుంటోంది. జమ్మూకాశ్మీర్‌లోని గందేర్‌బాల్, బండిపొరా జిల్లాలోని గురెజ్ సెక్టార్ పరిధిలో మంచు కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన సైనికుల సంఖ్య 14కి చ

మంచు కొండచరియలు విరిగిపడి.. 14జవాన్లు మృతి.. తెలుగు సైనికుడు కూడా?
, శుక్రవారం, 27 జనవరి 2017 (17:03 IST)
విపరీతంగా కురుస్తున్న మంచు సైనికులను పొట్టనబెట్టుకుంటోంది. జమ్మూకాశ్మీర్‌లోని గందేర్‌బాల్, బండిపొరా జిల్లాలోని గురెజ్ సెక్టార్ పరిధిలో మంచు కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన సైనికుల సంఖ్య 14కి చేరింది. వీరిలో ఓ తెలుగు జవాన్ కూడా మరణించినట్లు సైనికాధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం మరడాం గ్రామానికి చెందిన మామిడి నాగరాజు(25) భారత సైన్యంలో పనిచేశాడు. 
 
అయితే మంచు కారణంగా అతను ప్రాణాలు కోల్పోయినట్లు సైనికాధికారులు వెల్లడించారు. నాగరాజుకు ఏడాది క్రితమే సమీప బంధువు అనూషతో వివాహం జరిగింది. రాజు మరణంతో కుటుంబంలోనూ, గ్రామంలోనూ విషాద ఛాయలు నెలకొన్నాయి.
 
మరోవైపు గురెజ్ సెక్టార్‌లో సైనిక శిబిరంపై మంచు చరియలు విరిగిపడిన ఘటనలో ఆర్మీ సిబ్బంది ఇప్పటివరకు ఆరుగురు జవాన్లను రక్షించారు. ఇంకా మంచు చరియలు విరిగిపడిన ప్రాంతంలో ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు సైనికాధికారులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుజరాత్‌ను వెనక్కి నెట్టిన ఏపీ.. జేయూల్లో 42శాతం అమలు.. పరిశ్రమల్లో ఏపీనే టాప్..