Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దాండియా గార్భా నైట్ 2022కు బీ రెడీ

Dandia
, బుధవారం, 21 సెప్టెంబరు 2022 (23:34 IST)
దాండియా వేడుకకు విజయవాడ నగరం సన్నద్ధం అవుతోంది. సెప్టెంబరు 25వ తేదీన లబ్బీపేట ఎస్ఎస్ కన్వేన్వన్ సెంటర్లో గార్బా, దాండియా నైట్ 2022 మెగా ఈవెంట్  జరగనుండగా ఇందుకు అవసరమైన శిక్షణ చురుకుగా సాగుతోంది. చిన్నారుల మొదలు, యువత వారికీ ధీటుగా పెద్దలు విలువైన బహుమతులు గెలుచు కునేందుకు పోటీపడి మరీ అభ్యాసం చేస్తున్నారు. బెంజి సర్కిల్ సమీపంలో జ్యోతి కన్వెన్షన్ సెంటర్లో ప్రస్తుతం శిక్షణా కార్యక్రమం జరగుతుండగా, గార్భా, దాండియా నృత్యరీతుల కార్యశాలకు మంచి స్పందన లభిస్తోంది.


క్రియేటివ్ సోల్  కల్చరల్ సొసైటీ నేతృత్వంలో వరుసగా మూడు సంవ్సరాలు నగరంలో దాండియా వేడుక జరగగా, కరోనా నేపధ్యంలో గత రెండు సంవత్సరాలుగా నిర్వహించలేదు. 25వ తేదీ నాటి మెగా ఈవెంట్ లో దాండియా, గర్బా నృత్యాలతో పాటు గుజరాతీ సంగీత కళాకారుల పాటలు, వాద్య కళాకారులు వీనుల విందైన సంగీతం అందించనున్నారు.
 
కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతులు, హోరెత్తించే వాద్యంలతో  మెగా ఈవెంట్ ను ప్రత్యేకంగా డిజైన్ చేస్తుండగా, చిన్నారుల ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని సంస్ధ వ్యవస్ధాపకులు సుమన్ మీనా, నేహా జైన్ తెలిపారు. స్ధలా భావం వల్ల గార్బా, దాండియా నైట్ 2022 మెగా ఈవెంట్ ఎంట్రీ పాస్ లు పరిమితంగానే ఉన్నాయని, వాటిని పొందేందుకు 9966411099, 9440280906, 7306583825, 7338869596, 9908544747 నెంబర్లతో సంప్రదించవచ్చని తెలిపారు. జ్యోతి కన్వెన్షన్ సెంటర్లో 24 సాయంత్రం వరకు ఎంట్రీ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని సుమన్ మీనా పేర్కొన్నారు. విజేతలను దాండియా కింగ్, దాండియా క్వీన్, గార్బా రాజా, గార్బా రాణి పేరిట బహుమతులు అందచేస్తామని, మహిళలు, పురుషుల విభాగం నుండి వేర్వేరుగా మంచి వస్త్రధారణ కు కూడా బహుమతులు ఇవ్వనున్నామని నేహా జైన్ పేర్కొన్నారు.
 
సాధారణంగా ఉత్తర భారత దేశానికే పరిమితం అయిన గార్బా, దాండియా నృత్యరీతులను ఆంధ్రప్రదేశ్‌కు పరిచయం చేసే క్రమంలో తాము ఈ వర్క్ షాపును చివరగా మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్నామని క్రియోటివ్ సోల్ వ్యవస్ధాపకులు సుమన్ మీనా, నేహాజైన్ ఈ సందర్భంగా తెలిపారు. కళలతో దేశసమైఖ్యతను చాటేలా  గుజరాతీ, రాజస్ధానీ పడతులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి నగర వాసులు మంచి సహకారం అందిస్తున్నారన్నారు. విజయవాడ యువతీయువకుల కోసం ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం 15 రోజుల పాటు దాండియా శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
 
ఇందుకోసం జాతీయ స్ధాయిలో గుర్తింపు కలిగిన శిక్షకులను రప్పించామని సుమన్ మీనా తెలిపారు. ప్రదర్శనకారులలో పోటీతత్వాన్ని పెంపొందిస్తూ, ఉత్సాహభరిత ప్రదర్శనలను ప్రోత్సహించే క్రమంలో నిపుణత ప్రదర్శించిన కళాకారులకు బహుమతులను అందిస్తున్నామని నేహా జైన్ పేర్కొన్నారు. దుర్గాదేవికి మహిషాసురునికి మధ్య జరిగే యుద్దానికి ప్రతీకగా ఉత్తర భారత దేశంలో దాండియా అడతారని, అమ్మవారికి హారతి ఇచ్చే ముందు చిన్నా, పెద్ద కలిసి ఈ నృత్యం చేస్తారని నిర్వాహకులు వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జాన్సన్ లిఫ్ట్స్ "వాచ్" IOT ఆధారిత స్మార్ట్ సర్వీస్ టెక్నాలజీని ఏర్పాటు చేసింది