Publish Date: Thu, 07 Apr 2022 (14:47 IST)
Updated Date: Thu, 07 Apr 2022 (15:11 IST)
ఏపీలో కరెంట్ కోతల కారణంగా నానా తంటాలు పడుతున్నారు జనం. ఏపీలోని విశాఖ, విజయవాడ, తిరుపతి లతో పాటు ఇతర పల్లెల్లోనూ కరెంటు కోతలు ఉంటున్నాయి.
ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో రోజుకు ఆరు గంటలకు పైగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు అధికారులు.
ఉదయం 11 గంటల నుంచి రాత్రి విద్యుత్ కోత తప్పలేదు. అసలే వేసవి కాలం ఆపై కరెంటు కోతలు ఉండటంతో ప్రజలు.. ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.