Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో మరోమారు కర్ఫ్యూ పొడగింపు... ఈ నెల 20 వరకు..

ఏపీలో మరోమారు కర్ఫ్యూ పొడగింపు... ఈ నెల 20 వరకు..
, సోమవారం, 7 జూన్ 2021 (13:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా, ప్రస్తుతం అమల్లో ఉన్న కర్ఫ్యూను ఈ నెల 20వ తేదీ వరకు పొడగించింది. 
 
ప్రస్తుతం అమల్లో ఉన్న కర్ఫ్యూ గడువు ఈ నెల 10తో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం జగన్‌ మరో 10 రోజులపాటు కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
 
అయితే కర్ఫ్యూ సడలింపు సమయంలో కూడా ప్రభుత్వం మార్పులు చేసింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలు తమ వివిధ అవసరాలు తీర్చుకోవడానికి అవకాశం కల్పించింది. 
 
ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాలు నడవనున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పగటిపూట కర్ఫ్యూ విధించింది. మే 31తో గడువు ముగియడంతో జూన్‌ 10 వరకు కర్ఫ్యూను పొడిగించిన విషయం తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమికుడి బర్త్ డే పార్టీకి ఇంటికి గొళ్లెం పెట్టి వెళ్లింది.. చివరికి గ్యాంగ్ రేప్