Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కష్టంగా మారుతున్న ఓటుకు ప్రయాణం.. రద్దీ రద్దీ.. 

Advertiesment
కష్టంగా మారుతున్న ఓటుకు ప్రయాణం.. రద్దీ రద్దీ.. 
, గురువారం, 14 మార్చి 2019 (13:24 IST)
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తేదీ ఖరారు కావడంతో దేశం నలుమూలలా ఉన్న ఆంధ్రులు ఏప్రిల్ 11న తమ స్వస్థలాలకు వెళ్లి ఓటు వేయాలనుకుంటున్నారు. ఎన్నికల తేదీ వెలువడిన రెండు రోజులకే ఏప్రిల్ 10వ తేదీ ప్రయాణానికి లక్షల మంది ప్రజలు బస్సు, రైళ్లలో సీటు బుక్ చేసుకున్నారు. 
 
వివిధ ప్రాంతాల నుండి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే రైళ్లలో ఇప్పటికే రిజర్వేషన్లు నిండిపోయాయి. దాదాపు అన్ని రైళ్లలోనూ ఏప్రిల్ 10వ తేదీ నాటికి ఒక్కటంటే ఒక్క సీటు కూడా లేకపోవడం గమనార్హం. సాధారణంగా రిజర్వేషన్ దొరకకుంటే వెయిటింగ్ లిస్ట్‌లో అయినా బుక్ చేసుకోవచ్చు, కానీ దాదాపు అన్ని రైళ్లలో స్లీపర్, ఏసీ టికెట్లు రిగ్రెట్ కావడంతో కనీసం వెయిటింగ్ లిస్ట్‌లో కూడా బుక్ కావడం లేదు.
 
ఎక్కువ సంఖ్యలో రైళ్లు నడుపుతున్నామని రైల్వే శాఖ చెబుతున్నప్పటికీ కూడా అవన్నీ వేసవి కాలంలో నడిపే ప్రత్యేక రైళ్లు, అవి కూడా ఎన్నికల తేదీకి ముందు కాకుండా వేరే రోజుల్లో ఉన్నాయి. దీనితో ప్రజలు బస్సుల్లో రిజర్వేషన్ చేసుకుంటున్నారు. ప్రైవేట్ ట్రావెల్ సర్వీసుల వాళ్లు ఇదే అదనుగా ఛార్జీలను విపరీతంగా పెంచేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బోగస్ వర్శిటీల స్కామ్ : 50 మందిపై చార్జిషీట్