Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేరళ కారణంగా భారీగా పెరిగిన క‌రోనా మరణాలు... దేశంలో అదుపులోనే!

Advertiesment
corona
విజ‌య‌వాడ‌ , శనివారం, 13 నవంబరు 2021 (11:18 IST)
క‌రోనా మ‌ర‌ణాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో, భార‌త‌ దేశంలో గత కొద్దికాలంగా కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. క్రియాశీల రేటు ఊరటనిస్తుండగా, రికవరీ రేటు రోజురోజుకూ మెరుగవుతోంది. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను విడుదల చేసింది.
 
 
శుక్రవారం 12,66,589 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 11,850 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. కిందటి రోజు కంటే 5 శాతం మేర కేసులు తగ్గాయి. గత ఏడాది ప్రారంభం నుంచి 3.44 కోట్ల మందికి కరోనా సోకింది. వారిలో 3.38 కోట్ల మంది కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 12,403 మంది వైరస్ నుంచి బయటపడ్డారు.
 
 
గత కొద్దికాలంగా కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉండటంతో క్రియాశీల రేటు 0.40 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.26 శాతానికి పెరిగింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,36,308గా ఉంది. అవి 274 రోజుల కనిష్ఠానికి తగ్గుముఖం పట్టాయి. ఇక రోజూమాదిరిగానే మరణాల సంఖ్యపై కేరళ గణాంకాల ప్రభావం పడింది. దాంతో మృతుల సంఖ్య భారీగా పెరిగి..555కి చేరింది. ఇప్పటివరకు 4,63,245 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు.  మరోపక్క నిన్న 58.42 లక్షల మంది టీకా వేయించుకోగా.. మొత్తంగా 111 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మ‌ధుర గాన స‌ర‌స్వ‌తి సుశీల పుట్టిన రోజు నేడు