Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'నాన్న.. సారీ, అమ్మ.. సారీ, చరిత సారీ'... వివాహమైన 13 రోజులకే కానిస్టేబుల్ సూసైడ్

కడప జిల్లా ముద్దనూరు పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పిల్లనాగన్నగారి రాజు (26) అనే కానిస్టేబుల్ వివాహమైన 13 రోజులకే ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు సేవించి ఈ దారుణానికి పాల్పడ్డాడు

Advertiesment
constable suicide
, గురువారం, 18 ఆగస్టు 2016 (12:30 IST)
కడప జిల్లా ముద్దనూరు పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పిల్లనాగన్నగారి రాజు (26) అనే కానిస్టేబుల్ వివాహమైన 13 రోజులకే ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు సేవించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే.. కొండాపురం మండలం బుక్కపట్నం గ్రామానికి చెందిన సుబ్బరాయుడు, సబ్బమ్మకు ముగ్గురు కుమారులు వారిలో రాజు రెండో కుమారుడు. 2011లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. జనవరి 2012లో ముద్దనూరు పోలీస్ స్టేషన్‌ బాధ్యతలు చేపట్టాడు. 2016 ఆగస్టు 4న ముద్దనూరు మండల కొర్రపాడు గ్రామానికి చెందిన చరితను వివాహం చేసుకున్నాడు. 
 
ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం విధుల అనంతరం ఇంటికెళ్లాడు. రాత్రి కూడా డ్యూటీ చేయాల్సి ఉంది. డ్యూటీకి రాకపోవడంతో పోలీసులు ఫోన్‌ చేశారు. లిఫ్ట్‌ చేయలేదని, ఇంటికి ఫోన్‌ చేశారు. భోజనానికి కూడా రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బంగారు చైన్‌, రింగు సెల్‌ఫోన్‌ ఇంట్లో ఉన్నాయి. రాత్రి అన్ని చోట్ల వెతికినా ఆచూకీ తెలియలేదు.
 
బుధవారం ఉదయం పెద్దముడియం, కొండాపురం, మైలవరం, ముద్దనూరు పరిసరప్రాంతాల్లో పరిశీలించగా మునయ్య కోన వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. సమాచారాన్ని పోలీసులకు చేరవేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ రోజు నా పుట్టినరోజు.. గిఫ్టుగా నిన్ను నాకు అర్పించుకో.. మహిళా సీఈవోతో ఎండీ