Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ
, బుధవారం, 15 జులై 2020 (17:16 IST)
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ముగిసింది. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
 
ఈ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వం వహిస్తారు. ఈ అధ్యయన కమిటీ వచ్చే ఏడాది మార్చి31వ తేదీలోగా కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రక్రియ పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ కమిటీ ప్రతి పార్లమెంటు నియోజకవర్గం కేంద్రంగా నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై, అలాగే కొత్త జిల్లాల ఏర్పాటుపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.
 
దీంతో ప్రభుత్వం 13 జిల్లాలను పునవ్యవస్థీకరించి 25 జిల్లాలను ఏర్పాటు చేయనుంది. కొత్తగా ఏర్పాటు కానున్న అరకు జిల్లా భౌగోళికంగా 4 జిల్లాల్లో అంతర్భాగమై ఉన్నది. ఈ నేపథ్యంలో అరకును రెండు జిల్లాలు చేసేందుకు అధ్యయనం చేయాలని ఛీప్ సెక్రటరీ ముఖ్యమంత్రికి సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా కట్టడిలో దేశాలు దారి తప్పుతున్నాయి: ప్రపంచ ఆరోగ్య సంస్థ