Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం జగన్

jagan
, సోమవారం, 16 అక్టోబరు 2023 (22:54 IST)
విశాఖపట్నంలో నూతనంగా నిర్మించిన ఇన్ఫోసిస్ కేంద్రాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్‌ ప్రతినిధులు, పలువురు మంత్రులు పాల్గొన్నారు. 
 
35 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన ఈ కేంద్రాన్ని భవిష్యత్తులో మరింత విస్తరించనున్నారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సెంటర్‌గా పనిచేస్తుంది. దీని ఇంటీరియర్ డిజైన్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా హైబ్రిడ్ వర్క్‌ప్లేస్‌గా రూపొందించబడింది. 
 
ఈ కేంద్రం నుంచి దాదాపు 1000 మంది ఉద్యోగులు పని చేయనున్నారు. ఈ కార్యాలయాన్ని గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించారు. విశాలమైన ఆడియో, వీడియో కాన్ఫరెన్స్ హాల్స్, ఆధునిక ఫలహారశాల, విస్తారమైన పార్కింగ్ సౌకర్యాలు వంటి అత్యాధునిక సౌకర్యాలతో అమర్చబడి ఉంటుంది. 
 
ఇన్ఫోసిస్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై కంపెనీ ప్రతినిధులను సీఎం అడిగి తెలుసుకున్నారు.
 
 విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభించడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. విశాఖపట్నానికి అన్ని అనుకూలతలు ఉన్నాయని, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు స్థాయిలో విశాఖ అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని, రాష్ట్ర విభజన తర్వాత అన్ని ప్రయోజనాలు ఉన్న ఏకైక నగరం ఇదేనని అన్నారు. 
 
ఇప్పటి వరకు హైదరాబాద్ లాంటి నగరాన్ని ఆంధ్రా కోల్పోయిందన్నారు. ఈ తరహా పరిశ్రమలు రావడం వల్ల విశాఖ కూడా త్వరగా అభివృద్ధి చెందుతుందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిటైలర్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించడానికి కోకా-కోలా ఇండియాతో స్కిల్ ఇండియా భాగస్వామ్యం