నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఇకపై జెట్ వేగంతో సాగనున్నాయి. అమరావతి నిర్మాణం కోసం హడ్కో సంస్థ రూ.11 వేల కోట్ల నిధులను అందించనుంది. జనవరి 22వ తేదీ హడ్కో బోర్డు ఆమోదం తెలిపిన మేరకు ఆదివారం కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కుదుర్చుకున్నారు. సీఆర్డీయే - హడ్కో మధ్య ఈ డీల్ కుదిరింది.
ఇందులో ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్ట పాల్గొన్నారు. ఒప్పందం మేరకు ఏపీ రాజధాని అమరావతిలోని నిర్మాణాల కోసం రూ.11 వేల కోట్ల రుణం ఇవ్వనుంది. జనవరి 22వ తేదీన హడ్కో బోర్డు సమావేశంలో అమరావతికి నిధులు మంజూరుకు చెందిన లభించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఆదివారం హడ్కో .. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోన హడ్కో నిధులు విడుదల చేయనుంది.
పెళ్లయిన వారానికే మాజీ ప్రియుడితో వెళ్లిపోయిన వధువు
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో నవవధువు పెళ్ళయిన వారానికే తన మాజీ ప్రియుడుతో కలిసి వెళ్లిపోయింది. తనకు ఇష్టంలేని పెళ్లి చేయడం వల్లే తన ప్రియుడుతో కలిసి వెళ్లిపోతున్నట్టు నవ వధువు ఓ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
రంగారెడ్డి జిల్లాలో ఇరు కుటుంబ సభ్యులు కలిసి వధువుకు ఇష్టంలేని పెళ్లి చేశారు. ఈ విషయంపై ఆ యువతి షేర్ చేసిన వీడియోలో పేర్కొన్నట్టుగా.. తన నిశ్చితార్థానికి ముందే పెళ్లి కుమారుడు శివరామకృష్ణకు ముందే తమ ప్రేమ విషయం చెప్పాను. కానీ, తన తల్లిదండ్రులు బలవంతంగా ఒత్తిడి చేసి ఈ వివాహం జరిపించారు.
పెళ్లయిన తర్వాత భర్త శివరామకృష్ణ, తన తల్లిదండ్రులు, అత్తింటివారంతా కలిసి బెదిరించి కాపురం చేయించేందుకు ప్రయత్నించారు. కత్తులతో చంపుతామని బెదిరించారు. తన భర్త శివరామకృష్ణతో ఉండటం ఇష్టంలేక తన ప్రియుడు అరవింద్తో కలిసి పెళ్లిపోతున్నాను. ఇందులో ప్రియుడు అరవింద్ ప్రమేయం ఏమాత్రం లేదు. తన ఇష్టపూర్వకంగానే వెళుతున్నాను ఆ వధువు తన సెల్ఫీ వీడియోలో పేర్కొంది.