Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు రాష్ట్రాల్లో 30 రైల్వే స్టేషన్ల మూసివేత: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం

తెలుగు రాష్ట్రాల్లో 30 రైల్వే స్టేషన్ల మూసివేత: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం
, శనివారం, 30 జనవరి 2021 (13:11 IST)
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తమ జోన్ పరిధిలో మొత్తం 31 రైల్వే స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ రైల్వే స్టేషన్ల పరిధిలో ఆదాయం, రద్దీ లేని కారణంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 29 స్టేషన్లు మూతపడతాయని, ఏప్రిల్ 1 నుంచి మరో 2 రైల్వే స్టేషన్లు మూసివేస్తామని అధికారులు వెల్లడించారు.
 
అయితే ఈ స్టేషన్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఒక్క స్టేషన్ మాత్రం మహారాష్ట్ర పరిధిలోని నాందేడ్‌ జిల్లాలో ఉంది. డివిజన్ల వారీగా చూస్తే సికింద్రాబాద్ పరిధిలో 16 రైల్వే స్టేషన్లు, గుంతకల్ పరిధిలో 3, నాందేడ్ పరిధిలో 1, గుంటూరులో 4, హైదరాబాద్ పరిధిలో 7 స్టేషన్లను మూసివేయాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. 
 
ఉన్నట్టుండి 31 స్టేషన్లను మూసివేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ నమ్మకాన్ని వమ్ము చేయను.. భయపడే ప్రసక్తేలేదు.. నిమ్మగడ్డ