Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం జగన్ మోహన్ రెడ్డికి చంద్రబాబు సవాల్, ఏంటది?

సీఎం జగన్ మోహన్ రెడ్డికి చంద్రబాబు సవాల్, ఏంటది?
, శనివారం, 11 డిశెంబరు 2021 (16:55 IST)
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు ఓ సవాల్ విసిరారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ ఇంతకాలం ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.

 
ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని ఎందుకు నిలదీయడంలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం మా ఎంపీలు రాజీనామా చేస్తారు, మరి మీ ఎంపీలు రాజీనామా చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు.

 
ప్రత్యేక హోదా వస్తే ఒంగోలు వంటి నగరాలు హైదరాబాద్ మహానగరంలా మారిపోతాయని చెప్పిన జగన్ ప్రత్యేక హోదాపై ఎందుకు మౌనంగా వున్నారో చెప్పాలన్నారు. ఓ వైపు విశాఖ ప్లాంట్ కోసం కార్మికులు దీక్షలు చేస్తుంటే దానిపై పల్లెత్తు మాట అనకుండా మౌనంగా ఎందుకు వున్నారని నిలదీశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సరిహద్దులను ఖాళీ చేస్తున్న రైతులు.. 380 రోజులకు తర్వాత..?