Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమరావతి రాజధాని అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి: గల్లా జయదేవ్

Advertiesment
Amravati
, శనివారం, 19 సెప్టెంబరు 2020 (19:20 IST)
మూడు రాజధానుల అంశానికి అధికార వైసీపీ పార్టీ కట్టుబడి ఉన్న సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితిల్లోనూ ఈ నిర్ణయాన్ని అములు చేస్తామని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్షాలు మాత్రం రాజధానిని మార్చవద్దని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి.
 
ఈ నేపథ్యంలో లోక్‌సభలో అమరావతి అంశాన్ని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లేవనెత్తారు. ఏపీ రాజధాని అంశాన్ని కేంద్ర జాబితాలో చేర్చాలని జయదేవ్ డిమాండ్ చేశారు. అమరావతిలో రూ.41 కోట్లు అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు.
 
రాజధానిని మార్చడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. అమరావతి అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. ఆర్టికల్ 248 ప్రకారం కేంద్ర రాష్ట్ర జాబితాలో లేని అంశాలపై పార్లమెంటు ద్వారా చట్టం చేయవచ్చని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ.. కొత్తగా 8,218 కేసులు