Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్లైన తొలిరాత్రే భార్యపై బ్లేడుతో దాడి.. ఆడపిల్ల పుట్టిందని పరార్

మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఏపీలోని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో పెళ్లైన తొలిరోజే భార్య పట్ల ఓ శాడిస్టు భర్త అమానుషంగా ప్రవర్తించాడు. భార్యను బ్లేడుతో కోసి చిత్రహింసలకు గురిచేశాడు.

పెళ్లైన తొలిరాత్రే భార్యపై బ్లేడుతో దాడి.. ఆడపిల్ల పుట్టిందని పరార్
, శనివారం, 2 డిశెంబరు 2017 (18:05 IST)
మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఏపీలోని  చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో పెళ్లైన తొలిరోజే భార్య పట్ల ఓ శాడిస్టు భర్త  అమానుషంగా ప్రవర్తించాడు. భార్యను బ్లేడుతో కోసి చిత్రహింసలకు గురిచేశాడు. దీంతో పెళ్లైన తెల్లవారే నవ వధువు ఆస్పత్రిలో చేరింది. వివరాల్లోకి వెళితే... టీచర్‌గా పనిచేస్తున్న భర్త రాజేష్.. భార్య శైలజపై బ్లేడుతో ఒళ్లంతా గాయాలు చేశాడు. 
 
అలాగే కత్తితో కాళ్లు, చేతులను కోసి తన శాడీజాన్ని చూపించాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శైలజ పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. 
 
మరోవైపు భార్య ఆడపిల్లకు జన్మనిచ్చిందని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి విడిచిపెట్టి విదేశాలకు పారిపోయాడు. వివరాల్లోకి వెళితే విశాఖ నగరానికి చెందిన ఫాతిమా అనే యువతికి, నవాజ్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇటీవలే ఓ ఆడపిల్ల పుట్టింది. అయితే ఆడపిల్ల పుట్టిందనే నెపంతో ఎవరికీ చెప్పకుండా నవాజ్ విదేశాలకు పారిపోయాడు. 
 
ఆడపడుచు, అత్తమ్మ ఫాతిమాను ఇంటి నుంచి గెంటేయడంతో ఫాతిమా మహిళా సంఘాలకు ఫిర్యాదు చేసింది. విశాలాక్షి నగర్‌లో అత్తింటి ముందు మహిళ సంఘాలతో కలిసి ధర్నాకు దిగింది. ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎవడో కొన్‌కిస్కా వస్తే వంగి వంగి 100 లడ్లు ఇస్తారు... జేఈవోపై రోజా ఫైర్(వీడియో)