Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో పెళ్ళిళ్లు-డాబాలే వేదికలయ్యాయి..

తెలుగు రాష్ట్రాలకు పెళ్లి కళ వచ్చింది. గురువారం నుంచి శనివారం వరకూ మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు రెండు లక్షలకు మించిన వివాహాలు జరిగాయి. మరో మూడు నెలల వరకు ముహూర్తాలు లేకపోవడం

తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో పెళ్ళిళ్లు-డాబాలే వేదికలయ్యాయి..
, ఆదివారం, 26 నవంబరు 2017 (14:09 IST)
తెలుగు రాష్ట్రాలకు పెళ్లి కళ వచ్చింది. గురువారం నుంచి శనివారం వరకూ మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు రెండు లక్షలకు మించిన వివాహాలు జరిగాయి. మరో మూడు నెలల వరకు ముహూర్తాలు లేకపోవడంతో భారీ సంఖ్యలో వివాహాలు జరిగాయి. పెళ్ళి మంటపాలు, ఆలయాలు నిండిపోయాయి. మంటపాలు దొరకకుండా ముహూర్తాల కోసం ఇళ్ళల్లోనే చాలామంది వివాహాలు జరిపించారు. 
 
ఈ పెళ్లిళ్ళ కోసం సుమారు రూ.20వేల కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. సగటున రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ మూడు చొప్పున వివాహ ఆహ్వాన పత్రికలు అంది ఉంటాయని అంచనా. నగరాల్లోని కళ్యాణ్ మండపాలన్నీ షిఫ్ట్‌ల వారీగా అద్దెలకు ఇచ్చారు. మంటపాలు దొరకని వారు అపార్ట్‌మెంట్ సెల్లార్లలో వేదికలు నిర్మించుకుని పెళ్లి తంతును ముగించేశారు. వాహన రాకపోకలతో రద్దీ, ట్రాఫిక్ తప్పలేదు. 
 
అయితే మంటపాల కోసం, ఫోటోగ్రఫీ వంటి ఇతర సేవలకు జీఎస్టీ విధించడంతో ముహూర్తాలు కూడా లేకపోవడంతో అనేకమంది తల్లిదండ్రులు ఇళ్ళపై డాబాల్లో వేదికలు నిర్మించి వివాహాలు జరిపించేశారు. ఇంటి డాబాలను వివాహ వేదికలుగా మార్చడం ద్వారా జీఎస్టీతో కేటరింగ్, ఫోటోగ్రఫీ వంటి ఇతరత్రా ఖర్చుల్లో కొంతమేరకు తగ్గాయని వధూవరుల తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేఈకి జగన్మోహన్ రెడ్డి చెక్.. పత్తికొండ అభ్యర్థిగా శ్రీదేవి