Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్‌గా సీఎం జగన్ : నారా లోకేశ్

Advertiesment
prajavedika
, శనివారం, 25 జూన్ 2022 (12:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజావేదిక కూల్చి మూడేళ్లు అయిందని, ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించిన సీఎం జగన్ విధ్వంస పాలన విజయవంతంగా సాగుతుందనని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అందుకే విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్‌గా సీఎం జగన్ ఉన్నారన్నారు. 
 
గత ఎన్నికలకు ముందు ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను పదేపదే అడిగింది ప్రజా పాలన సాగించేందుకు కాదని ప్రతిపక్షంపై కక్ష సాధింపు కోసమేనని చెప్పారు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రజా వేదికను వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చివేసి మూడేళ్లు అయిన సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
ప్రజా వేదిక కూల్చకముందు... కూల్చిన తర్వాతి ఫోటోలను ఆయన షేర్ చేశారు. "విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ వైఎస్. జగన్, ప్రజా వేదిక కూల్చడంతో మొదలైన విధ్వంసకాండ ఇపుడు ఏకంగా రాష్ట్రాన్నే దహించే స్థాయికి చేరుకుంది. ఒక్క ఛాన్స్ అడిగింది ప్రజా సంక్షేమం కోసం కాదు. రాష్ట్రంలో ప్రతిపక్షంపై కక్ష తీర్చుకోవడం కోసమే అన్నట్టుగా సాగుతోంది విధ్వంస పాలన" అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జులై నెలలో నాలుగు పథకాల అమలు.. అకౌంట్లలో నగదు విడుదల