Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దెయ్యం పట్టిందని.. భార్యపై స్వామీజీల అత్యాచారం... వీడియో తీసిన భర్త

దెయ్యం పట్టిందని.. భార్యపై స్వామీజీల అత్యాచారం... వీడియో తీసిన భర్త
, శనివారం, 19 అక్టోబరు 2019 (15:49 IST)
టెక్నాలజీ పెరిగినా మూఢనమ్మకాలపై నమ్మకాలు ఏమాత్రం తగ్గట్లేదు. తాజాగా మూఢనమ్మకాలను మూఢంగా నమ్మిన ఓ వ్యక్తి తన భార్యను మాంత్రికులచేత అత్యాచారానికి గురయ్యేలా చేశాడు. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండగా.. భార్యకు దెయ్యం పట్టుకుందని భర్త భావించాడు. 
 
అంతేగాకుండా భార్యను మాంత్రికుడి వద్దకు తీసుకెళ్లాడు. ఆ మాంత్రికుడు ఆమెలో దెయ్యం వుందని చెప్పి.. దాన్ని పోగొట్టాలంటే ఆమెపై అత్యాచారం జరగాలన్నాడు. దీన్ని గుడ్డిగా నమ్మిన బాధితురాలి భర్త ఆమెపై అత్యాచారానికి పాల్పడేలా చేశాడు. ఈ వ్యవహారం బాధితురాలి తండ్రి ఒమన్ నుంచి రావడంతో.. అతని సహాయంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఏడాది కాలంలో ఇలా ముగ్గురు మాంత్రికులు ఆమెపై అత్యాచారం చేశారు. 
 
అత్యాచారాలపై బాధితురాలు ప్రతిఘటించినప్పుడల్లా.. ఆ వీడియోలను ఇంటర్నెట్‌లో పెడుతానని భర్త బ్లాక్‌మెయిల్ చేసేవాడు. బాధితురాలి తండ్రి ఒమన్ నుంచి తిరిగి రావడంతో.. అతనికి విషయం చెప్పింది. తండ్రి సహాయంతో స్థానిక పోలీసులను ఆశ్రయించి సదరు మాంత్రికులపై కేసు నమోదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ బంద్ సంపూర్ణం : ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ