Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 15 April 2025
webdunia

శ్రీనివాస మంగాపురంలో ఆదిశంకరాచార్యులు మహోత్సవం

Advertiesment
bjp
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 5 నవంబరు 2021 (11:57 IST)
చిత్తూరు జిల్లా శ్రీనివాస మంగాపురంలో ఆదిశంకరాచార్యులు మహోత్సవం ఘనంగా జరిగింది. బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆది శంకరాచార్యుల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. 
 
 
కేదారినాథ్ నుంచి మోడీ ప్రసంగాన్ని శ్రీనివాసమంగాపురంలో భారీ స్క్రీన్ ద్వారా భక్తులు తిలకించేందుకు అవకాశం కల్పించారు. కళ్యాణ వెంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన భక్తులందరూ ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమం తర్వాత మీడియాతో సునీల్ మాట్లాడుతూ జగద్గురువుగా దేశంలోని అనేక మతాలను హిందూమతంలో ఏకం చేసిన ఘనత శంకరాచార్యులదని కొనియాడారు. దేశ ఐక్యతకు సమగ్రతకే జగద్గురు శంకరాచార్యులు ఆదర్శంగా నిలిచారన్నారు.

 
కేదార్ నాధ్ లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆది శంక‌రాచార్యుల వారి స‌మాధి పున‌:  ప్రారంభోత్స‌వం చేశారు. దీనిని పుర‌స్క‌రించుకుని, ఆది శంక‌రాచార్యులు న‌డ‌యాడిన అన్ని పుణ్య క్షేత్రాల‌లో ఆయ‌న సంస్మ‌ర‌ణ కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా ఈ వేడుక‌లు శంక‌రాచార్యుల వారు సంద‌ర్శించిన అన్ని పుణ్య క్షేత్రాల‌లో జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా ఏపీ ప్రభుత్వం పైన బీజేపీ జాతీయ కార్యదర్శి  సునీల్ దియోధర్తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఎందులోనూ చిత్త‌శుద్ధి లేద‌ని వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫిరోజ్‌పూర్ వ్యవసాయ క్షేత్రంలో టిఫిన్ బాంబు కలకలం