Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాలోని వలస కూలీలకు బిగ్ రిలీఫ్...

తెలంగాణాలోని వలస కూలీలకు బిగ్ రిలీఫ్...
, గురువారం, 30 ఏప్రియల్ 2020 (17:32 IST)
లాక్‌డౌన్ కారణంగా తెలంగాణా రాష్ట్రంలో చిక్కుకున్న మహారాష్ట్ర వలస కూలీలు, విద్యార్థులకు అతిపెద్ద ఊరట లభించింది. ఈ కూలీలు తమతమ స్వస్థాలకు చేరుకునేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతిచ్చింది. దీంతో ఈ కూలీలంతా తమతమ సొంతూర్లకు వెళ్లనున్నారు. 
 
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. ఇది వచ్చే నెల 3వ తేదీతో ముగియనుంది. అయితే, ఈ లాక్‌డౌన్‌ను పొడగించే అవకాశాలు లేకపోలేదు. అయితే, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులు తమతమ ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా అంతర్‌రాష్ట్ర సర్వీసులకు కేంద్రం అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో చిక్కుకునిపోయిన వలస కూలీలు వచ్చేందుకు మహారాష్ట్ర సర్కారు సమ్మతించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నరసారావు పేటలో 104 మందికి కరోనా .. కారణం ఏంటంటే?