Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సజ్జలకి అయ్యన్న సెటైర్లు

సజ్జలకి అయ్యన్న సెటైర్లు
, సోమవారం, 28 సెప్టెంబరు 2020 (13:21 IST)
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు. ఆయన ఏమన్నారంటే...
 
"జగన్ రెడ్డి..ఇప్పటికైనా అక్రమాస్తులు ప్రభుత్వ ఖజానాకి జమ చేసి చట్టాన్ని గౌరవించండి.  ఏడాదిలో రాజకీయ నాయకుల పై పెండింగ్ లో ఉన్న కేసుల విచారణ పూర్తి చెయ్యాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.

43 వేల కోట్ల ప్రజా ధనం దోపిడీ,యాలహంక రాజప్రసాదం,లోటస్ పాండ్ ప్యాలస్,తాడేపల్లి లో విలాసవంతమైన విల్లా,పేదల భూములు కొట్టిసి కట్టిన ఇడుపులపాయ ఎస్టేట్,దొంగ సొమ్ముతో పెట్టిన సాక్షి,క్విడ్ ప్రోకోతో పెట్టిన భారతి సిమెంట్స్ ఇలా అనేక ఆస్తులు ఈడీ అటాచ్ చేసింది.

రకరకాల పిటిషన్లు వేసి 10 ఏళ్ళు గడిపేసారు.ఇప్పటికైనా దోచుకున్న సొత్తు ప్రజలకు ఇచ్చేయండి. లేకపోతే మరోసారి జైలుబాట తప్పదు. చట్టాల గురించి లెక్చర్లు ఇస్తున్న సజ్జల రెడ్డి ముందు అక్రమ సొత్తుతో కట్టిన ఇళ్లను కాళీ చెయ్యమని జగన్ రెడ్డిని డిమాండ్ చెయ్యాలి."

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రయివేటు దవాఖానకు పోయి డబ్బులు వృథా చేసుకోవద్దు: మంత్రి హరీశ్ రావు