Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాళ్లు పట్టుకోవడం.. పాదాలు పిసకడం అంటే ఇదీ... : విజయసాయికి కౌంటర్ ఇచ్చిన్న అయ్యన్న

jagan touch modi feet
, శుక్రవారం, 13 అక్టోబరు 2023 (12:10 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై వైపాకా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు ఎంత మంది కాళ్లు పట్టుకున్నావంటూ ప్రశ్నించారు. దీనికి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సరైన రీతిలో కౌంటర్ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ కాళ్లను వైకాపా అధినేత, ఏపీ సీఎం జగన్ పట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి.. కాళ్లు పట్టుకోవడం అంటే అంటూ ట్వీట్ చేశారు. పైగా, ఈ ఫోటోతో పాటు పట్టిన కాళ్లు, పిసికిన పాదాలు గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నించారు. 
 
ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డిపై అయ్యన్నపాత్రుడు చెలరేగిపోయాడు. ప్రధాని మోడీ కాళ్లను జగన్ పట్టుకున్న ఫోటోను షేర్ చేసిన అయ్యన్నపాత్రుడు... "బాబాయ్‌ని వేసేసిన అబ్బాయిని తప్పించేందుకు ఢిల్లీ వెళ్లి అపాయింట్మెంట్లు ఇప్పించేందుకు పట్టిన కాళ్లు, పిసికిన పాదాలు గుర్తొచ్చాయా? అని ప్రశ్నించారు. కన్నింగ్ పనులు చేయడం, కాళ్లు పట్టడం అలవాటైన ఏ1, ఏ2 ప్రాణాలకు ఎవరు పిలిచినా.. ఎవరు కలిసినా అలాగే, కనిపిస్తుంది కదా కసాయి రెడ్డీ" అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Jio కొత్త 4G ఫీచర్ ఫోన్.. స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఇవే