Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అయేషా మీరా మృతదేహానికి మళ్లీ శవపరీక్ష - సీబీఐ నిర్ణయం

అయేషా మీరా మృతదేహానికి మళ్లీ శవపరీక్ష - సీబీఐ నిర్ణయం
, శుక్రవారం, 13 డిశెంబరు 2019 (10:39 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు విచారణ మళ్లీ పునఃప్రారంభంకానుంది. ఈ హత్య కేసు రీ విచారణలో భాగంగా, 12 యేళ్ల క్రితం పాతిపెట్టిన అయేషా మీరా మృతదేహాన్ని వెలికి తీసి మళ్లీ రీపోస్టుమార్టం చేయాలని సీబీఐ భావిస్తోంది. ఈ మేరకు ఉన్నతాధికారులు స్థానిక అధికారులను సంప్రదించారు. 
 
2007లో డిసెంబర్ 27న విజయవాడ శివారు ప్రాంతాల్లో తెనాలికి చెందిన విద్యార్థిని ఆయేషా మీరా దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో కొందరు ప్రముఖ రాజకీయ నాయకుల పుత్రులు ఉన్నట్టు ఆరోపణలు వచ్చినా, అవి నిరూపితం కాలేదు. కేసుకు సంబంధం లేని సత్యంబాబు అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఈ కేసు విచారణ కూడా సుధీర్ఘకాలం పాటు సాగింది. తొమ్మిదేళ్ల జైలు జీవితం అనంతరం సత్యం బాబు నిర్దోషిగా బయటకు వచ్చాడు. ఆపై కేసులో అసలు నిందితులు ఎవరో తేల్చేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. కొన్ని నెలల క్రితమే మృతదేహం అవశేషాలను బయటకు తీయాలని భావించినా, కొన్ని కారణాలతో అది సాధ్యపడలేదు. ఈ నెల 30లోగా రీ పోస్ట్ మార్టమ్ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ అక్రమాలు వెలికి తీసిన ఐఆర్ఎస్‌పై సస్పెండ్ వేటు