Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాలంటీర్లలో జోష్‌ను నింపనున్న జగన్ సర్కారు.. ఉగాదికి..?

Advertiesment
Awards
, గురువారం, 1 ఏప్రియల్ 2021 (16:18 IST)
ఏపీ ప్రభుత్వం వాలంటీర్లలో జోష్‌ను నింపనుంది. తమ జీతాలు పెంచాలని కొన్ని జిల్లాల్లో వాలంటీర్లు డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగాది రోజున ఉత్తమ సేవలు అందించిన గ్రామ, వార్డు వాలంటీర్లను సత్కరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పేరిట మూడు కేటగిరీలుగా వార్డు, గ్రామ వార్డు వాలంటీర్లను ఏపీ ప్రభుత్వం సత్కరించనుంది. 
 
సేవా వజ్రకు రూ.30 వేల నగదు, సేవా రత్నకు రూ. 20 వేలు, సేవా మిత్రకు రూ.10 వేల నగదు పురస్కారాన్ని, శాలువాతో ఏపీ ప్రభుత్వం సత్కరించనుంది. సత్కారానికి నవరత్నాల అమలులో చూపిన చొరవ, కోవిడ్, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో అందించిన సేవలను పరిగణనలోకి తీసుకోనున్న ప్రభుత్వం... ఏప్రిల్ 13 తేదీన వార్డు, గ్రామ వాలంటీర్లను సత్కరించే కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనితారాణి దుస్తులు మార్చుకుంటుంటే వీడియోలు తీసి వేధించారు: నారా లోకేష్