Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు

YS Avinash Reddy
, శనివారం, 20 మే 2023 (14:16 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల్లో ఈ నెల 22న విచారణకు రావాలని పేర్కొంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు ఇప్పటికే రెండుసార్లు విచారించారు. 
 
ఇటీవల మరోమారు నోటీసులు జారీ చేసింది. ముందస్తు అపాయింట్‌మెంట్‌లు ఉండడంతో విచారణకు రాలేనని సీబీఐ అధికారులకు ఎంపీ లేఖ రాశారు. నాలుగు రోజులు గడువు ఇవ్వాలని అధికారులను కోరారు. అవినాశ్ రెడ్డి తల్లికి అనారోగ్యానికి గురవడంతో శుక్రవారం ఆమెను ఆసుపత్రికి తరలించారు. 
 
దీంతో శుక్రవారం కూడా అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు శనివారం మరోమారు నోటీసులు జారీ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హిరోషిమా నగరంలో 42 అడుగుల మహాత్మా గాంధీ విగ్రహం