Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజ‌య‌వాడ‌ డిప్యూటీ మేయర్‌గా ఆవుతు శ్రీ‌శైల‌జా రెడ్డి

విజ‌య‌వాడ‌ డిప్యూటీ మేయర్‌గా ఆవుతు శ్రీ‌శైల‌జా రెడ్డి
, శుక్రవారం, 6 ఆగస్టు 2021 (16:24 IST)
విజ‌య‌వాడ నగరపాలక సంస్థ రెండోవ డిప్యూటీ మేయర్‌గా ఆవుతు శ్రీ‌శైల‌జా రెడ్డి శుక్రవారం బాధ్య‌త‌లు స్వీకరించారు.

వీఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలోని కౌన్సిల్ భ‌వ‌నంలో ఆమె చాంబ‌ర్‌లో నగర మేయర్ శ్రీ‌మ‌తి రాయన భాగ్యలక్ష్మి, దేవదాయ ధర్మదాయ శాఖా మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ క‌రిమున్నీసా, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పి.గౌతమ్ రెడ్డి చైర్మ‌న్ ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్, గౌడ కార్పొరేష‌న్ చైర్మ‌న్ మ‌ధు శివ‌రామ‌కృష్ణ‌, కొండ‌వీటి ఆకాడ‌మీ చైర్మ‌న్ నారాయ‌ణ‌రెడ్డి, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెలందుర్గ‌, దుర్గ‌గుడి చైర్మ‌న్ పైలా సొమినాయుడు, వైసీపీ ప్లార్ లీడ‌ర్ వెంక‌ట స‌త్య‌నారాయ‌ణ‌, వైసీపీ న‌గ‌ర అధ్య‌క్ష‌లు బొప్ప‌న భ‌వ‌కుమార్, ప‌లువురు కార్పొరేట‌ర్లు వైసీపీ  శ్రేణులు త‌దిత‌రులు బాధ్య‌త‌లు స్వీకరించిన శ్రీ‌శైల‌జా రెడ్డి ని అభినందించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి వెలంప‌ల్లి మ‌ట్లాడుతూ, రాజ‌కీయ‌ల్లో మ‌హిళల‌కు ప్రాధాన్యం క‌ల్పిస్తోంది కేవ‌లం వైఎస్సార్ సీపీనే అని అన్నారు. అర్హ‌లంద‌రికీ ప్ర‌భుత్వ ప‌ధ‌కాలు పూర్తి స్థాయిలో అందేలా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌న్నారు. న‌గ‌రాభివృద్దికి పూర్తి స‌హ‌కారం అంద‌జేస్తామ‌ని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో  కార్పొరేట‌ర్లు, పార్టీ నాయ‌కులు, అధికారులు సిబ్బంది, పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుంటూరు జిల్లా సీతానగరం అత్యాచారం కేసులో పురోగతి