Publish Date: Wed, 22 May 2024 (17:13 IST)
Updated Date: Wed, 22 May 2024 (17:33 IST)
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేద సీఎంనని గొప్పలు చెప్పుకుంటున్నారు. తాను సీఎంగా జీతం తీసుకోవడం లేదని ప్రచారం చేశారు. తాజాగా ఏపీ సీఎం జగన్పై రఘు రామకృష్ణంరాజు మాత్రం జగన్ను హేళన చేశారు.
"మా పేద ముఖ్యమంత్రి తాను పేదవాడినని చెప్పుకుంటూ చార్టర్ ఫ్లైట్కి గంటకు 15 లక్షలు ఖర్చు చేస్తున్నాడు. ఇందులో ఏ భాగం పేలవంగా ఉందో నాకు తెలియదు. దీనికి జగన్ ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెడుతున్నాడో లేక వ్యక్తిగతంగా ఖర్చు చేస్తున్నాడో నాకు తెలియదు." అని ఆర్ఆర్ఆర్ తెలిపారు.
ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో అడుగుపెట్టడని తనకు తెలుసన్నారు. ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డిని నేను చాలా దగ్గరగా చూసిన వ్యక్తినంటూ చెప్పుకొచ్చారు.
జగన్ చెప్పే దరిద్రపు సీఎం విలువలు వాస్తవానికి ఆయన చేసే పనులకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. లండన్-ఫ్రాన్స్-స్విట్జర్లాండ్కు జగన్ భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.