Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దసరా స్పెషల్ : విజయవాడకు 1000 ప్రత్యేక బస్సులు

apsrtc bus
, గురువారం, 12 అక్టోబరు 2023 (14:07 IST)
దసరా పండుగ సందర్భంగా విజయవాడలో ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, రాజమండ్రి, విశాఖపట్నం వంటి ప్రాంతాల నుంచి విజయవాడకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. 
 
దసరా పండుగ యాత్రలను పురస్కరించుకుని ఏపీఎస్ ఆర్టీసీ పలు ప్రాంతాల నుంచి విజయవాడకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు ప్రతిరోజు తిరుగుతున్న 355 బస్సులకు ఇవి అదనం. ఈ నెల 18 నుంచి 23 వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి.
 
దసరా ప్రయాణాలను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ ఆర్టీసీ అక్టోబరు 13 నుంచి పలు ప్రాంతాలకు అదనపు ఛార్జీలు లేకుండా ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
 
 
 
దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసుల్లో ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. అక్టోబర్ 13 నుంచి 26 వరకు పలు ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు.
 
హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి విజయవాడకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. విజయవాడ నుంచి విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం, తిరుపతి, భద్రాచలం, రాయలసీమకు వెయ్యి బస్సులను ఏర్పాటు చేశారు.
 
 
 
అక్టోబర్ 13న రాజమండ్రి నుంచి 6, విశాఖపట్నం నుంచి 10, బెంగళూరు నుంచి ఒకటి, చెన్నై నుంచి 3, ఇతర ప్రాంతాల నుంచి విజయవాడకు 18 ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు. అక్టోబర్ 18 నుంచి క్రమంగా బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించారు.
 
 
 
ప్రత్యేక బస్సులను నియంత్రించేందుకు విజయవాడ బస్ టెర్మినల్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు ప్రయాణాలకు ఒకేసారి టిక్కెట్‌ను కొనుగోలు చేస్తే 10 శాతం రాయితీ ఇవ్వబడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టమోటాలు - ఉల్లుపాయల వంతు అయిపోయింది.. ఇపుడు వెల్లుల్లి వంతు వచ్చింది..