Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14న ఏపీలో పిడుగులతో కూడిన వర్షమే వర్షం

Advertiesment
rain

ఠాగూర్

, శుక్రవారం, 13 జూన్ 2025 (22:53 IST)
ఈ నెల 14వ తేదీ శనివారం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం పడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపింది. ఈ కారణంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 
 
మరికొన్ని చోట్ల చెదురుముదురుగా భారీ వర్షాలు కూడా నమోదయ్యే సూచనలు ఉన్నాయని ఏపీఎస్‌డీఎంఏ హెచ్చరించింది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 
 
ఏపీఎస్డీఎంఏ డైరెక్టర్ ప్రఖర్ జైన్ స్పందిస్తూ, ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వర్షాల సమయంలో ప్రజలు బయటకు వెళ్లేటపుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద నిలబడరాదని ఆయన సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తకుండా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ప్రభుత్వం కూడా అన్ని రకాల సహాయక  చర్యలకు సిద్ధంగా ఉండాలని ప్రఖర్  జైన్ భరోసా ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పటాన‌చెరులో ప్రత్యక్షమైన పవన్ కళ్యాణ్!!