బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నెలకొంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్ర ప్రాంతీయ కార్యాలయం వెల్లడించింది. ఈ యేడాది దేశంలోకి నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించిన విషయం తెల్సిందే. అప్పటివరకు నుంచి దేశంలో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెల్సిందే. అయితే, ఈ రుతుపవనాలు దేశ వ్యాప్తంగా మరింతగా వ్యాపిస్తాయని పేర్కొంది.
పశ్చిమ మధ్య, సరిహద్దు వాయువ్య బంగాళాఖాతం సహా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, కాబట్టి జాలర్లు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, ఈ శుక్రవారం ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.