Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత క్రికెట్ జట్టు ఓటమితో గుండెపోటు ... మరణించిన టెక్కీ!

jyothi kumar
, సోమవారం, 20 నవంబరు 2023 (20:35 IST)
భారత క్రికెట్ జట్టు ఓటమితో పలు ప్రాంతాల్లో విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023లో భారత్ ఓడిపోయింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేక పలు ప్రాంతాల్లో అనేక మంది యువకులు గుండెపోటుతో చనిపోయారు. ఇలాంటి వారిలో తిరుపతికి చెందిన టెక్కీ కూడా ఉన్నారు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీలు కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన జ్యోతికుమార్ అనే టెక్కీ గుండెపోటుకు గురై కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. 
 
తిరుపతి జిల్లా దుర్గ సముద్రానికి చెందిన జ్యోతి కుమార్ (32) అనే టెక్కీ ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆివారం జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌ను వీక్షిస్తూ గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు. జ్యోతి కుమార్ తితిదే విశ్రాంత ఉద్యోగి. త్వరలోనే జ్యోతికుమార్ పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు సంబంధాలు చూస్తున్నారు. ఇంతలోనే జ్యోతి కుమార్ గుండెపోటుతో చనిపోవడంతో కుటుంబంలో తీవ్ర కలకలం సృష్టించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్ట్రేలియా విజయానికి మహాభారత రోజులకు ముడేసిన సుప్రీంకోర్టు మాజీ జడ్జి