Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చడీచప్పుడు లేకుండా ఉద్యోగుల జీపీఎఫ్ డబ్బులు విత్‌డ్రా

Advertiesment
currency
, గురువారం, 30 జూన్ 2022 (14:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు నవ్వులపాలైంది. ఉద్యోగులకు చెందిన జీపీఎఫ్ డబ్బులను చడీచప్పుడు లేకుండా విత్‌డ్రా చేసింది. ఉద్యోగుల ఖాతాల నుంచి వారికి తెలియకుండా ఏకంగానే రూ.800 కోట్లను మాయం చేసింది. ఈ బాధితుల్లో 90 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. రూ.800 కోట్ల మేరకు ప్రభుత్వం విత్‌డ్రా చేసిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. జీపీఎఫ్ ఖాతాల నుంచి నగదు విత్ డ్రా చేయడాన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. 
 
ఇదే అంశంపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ, ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు డ్రా అయిపోతున్నాయి. గతంలో ఇదే తరహాలో డబ్బులు డ్రా అయితే కేసు నమోదుచేస్తామని హెచ్చరిస్తే తిరిగి డబ్బులు జమ చేశారు. జీపీఎఫ్ స్లిప్పులను డౌన్‌లౌడ్ చేసుకుని చూస్తే డబ్బులు విత్ డ్రా అయినట్టు స్పష్టంగా తెలుస్తుందన్నారు. 
 
తన ఖాతా నుంచే ఏకంగా రూ.80 వేల వరకు డ్రా అయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో చాలా మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులను ప్రభుత్వం విత్ డ్రా చేసిందని ఆయన వాపోయారు. గతంలో జమ చేసిన డీఏ బకాయిలను ప్రభుత్వం తీసేకుంది. ఇపుడు రూ.800 కోట్లను 90 వేల మంది ఉద్యోగుల ఖాతాల నుంచి ప్రభుత్వం డ్రా చేసింది అని ఆయన చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమర్నాథ్ యాత్ర ప్రారంభం - 80 వేల మంది సైనికులతో పహారా