Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆనందయ్య మందు పంపిణీకి సహకరించని ప్రభుత్వం...

ఆనందయ్య మందు పంపిణీకి సహకరించని ప్రభుత్వం...
, బుధవారం, 23 జూన్ 2021 (16:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన నాటు మందు వైద్యుడు ఆనందయ్య కరోనా బాధితులకు స్వస్థత చేకూర్చే నిమిత్తం ఓ మందును తయారు చేశారు. ఈ మందును తీసుకున్న అనేక మంది కరోనా బాధితులు పూర్తిగా కోలుకున్నారు. ముఖ్యంగా చనిపోయే దశలో ఉన్నవారు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. 
 
ఈ క్రమంలో ఆనందయ్య మందును పంపిణీ చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. కానీ, కరోనా కోసం తాము తయారు చేస్తున్న మందు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆనందయ్య తాజాగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు బాధాకరమన్నారు. 
 
మందు పంపిణీకి సంబంధించి ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ... సరైన స్పందన రాలేదని వాపోయారు. మందు తయారీకి సరైన సామగ్రి సమకూరకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని, అందుకే మందు తయారీలో వెనుకబడ్డామని తెలిపారు. 
 
అయినా పలువురు దాతలు అందిస్తున్న సహకారంతో ప్రజలకు మందును అందిస్తున్నామని చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా మందును అందిస్తున్నామని తెలిపారు. బడ్డీ బంకుల్లో తమ మందును అమ్ముతున్నారని... అది ప్రభుత్వ లోపమేనన్నారు. 
 
అలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా బాధితులందరికీ కరోనా మందును ఉచితంగా ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రతి జిల్లాలో ప్రజాప్రతినిధుల ద్వారా మందును అందజేస్తున్నామని తెలిపారు. 
 
ఏయే జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులు ఉన్నాయో... ప్రజాప్రతినిధులు, అధికారులు తెలుసుకుని తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని, ఆ సంఖ్యకు అనుగుణంగా మందును తయారు చేస్తామని ఆనందయ్య వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‘ఇప్పుడు ప్రకాశించే సమయం వచ్చింది’ టీవీసిలో ఒలింపిక్‌ ఫెన్సర్‌ సి.ఎ. భవానీని వేడుక చేసిన రిన్‌