Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాడు అమ్మ... నేడు బాబాయ్... రాజకీయ నిరుద్యోగులుగా మార్చిన జగన్ : మంత్రి కేఈ విసుర్లు

రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా మహానేత దివంగత వైఎస్ రాజేశేఖర్ రెడ్డి కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో స్వయానా వైఎస్ సోదరుడ

నాడు అమ్మ... నేడు బాబాయ్... రాజకీయ నిరుద్యోగులుగా మార్చిన జగన్ : మంత్రి కేఈ విసుర్లు
, బుధవారం, 22 మార్చి 2017 (08:57 IST)
రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా మహానేత దివంగత వైఎస్ రాజేశేఖర్ రెడ్డి కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో స్వయానా వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఇది వైఎస్ కుటుంబంలోనే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనమైంది. 
 
దీనిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన వైఎస్‌ వివేకానందరెడ్డికి తన సానుభూతిని తెలుపుతున్నట్టు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, 'స్థానిక ప్రజా ప్రతినిధుల కోటాలో కాకుండా ఎమ్మెల్యే కోటాలో ఆయనకు సీటు ఇచ్చి ఉంటే ఈ అవమానం ఉండేది కాదన్నారు. 
 
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కావాలనే వివేకాను ఈ ఎన్నికల్లో నిలబెట్టినట్లు తెలుస్తోందన్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ సతీమణి, జగన్ తల్లి వైఎస్.విజయమ్మను విశాఖలో పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో ఎదురైన ఓటమి తర్వాత ఆమె రాజకీయాల నుంచి కనుమరుగయ్యారు. ఇప్పుడు బాబాయ్‌ను ఈ ఎన్నికల్లో ఓడించిన జగన్... రాజకీయ నిరుద్యోగిగా మార్చేశారు' అంటూ విమర్శించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ కోల్పోయిన చోట పవన్ వెతుక్కుంటున్నాడా.. ఎవరికి లాభం?