Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రాజెక్టుల వద్ద నిద్రపోయా... పరుగెత్తిస్తున్నా... సీఎం చంద్రబాబు

అన్నదాతల ముఖాల్లో చిరునవ్వు చూసేందుకు, వారికి నీటి సదుపాయాన్ని అందించేందుకు నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామనీ, వీటి కోసం నేను ప్రాజెక్టుల వద్దే నిద్రపోయానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం జిల్లాలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. "

ప్రాజెక్టుల వద్ద నిద్రపోయా... పరుగెత్తిస్తున్నా... సీఎం చంద్రబాబు
, శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (21:49 IST)
అన్నదాతల ముఖాల్లో చిరునవ్వు చూసేందుకు, వారికి నీటి సదుపాయాన్ని అందించేందుకు నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామనీ, వీటి కోసం నేను ప్రాజెక్టుల వద్దే నిద్రపోయానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం జిల్లాలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. " 1100 నెంబరుతో ఓ పరిష్కార వేదికను ఏర్పాటు చేశాను. మీ అభిప్రాయాలు అడుగుతున్నా... 18 శాతం మందే స్పందించారు. మిగిలినవాళ్ల ఫోన్లు చాలా బిజీగా వుంటున్నాయి. 
 
మీ సమస్యలను, కష్టాలను నాకు చెబితే వెంటనే పరిష్కరిస్తా. నాపై మీ అభిమానం రోజురోజుకీ పెరుగుతోంది. సంపద సృష్టిస్తా. ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తా. పాదయాత్ర ఇక్కడ నుంచే మొదలుపెట్టాను. రైతాంగం కోసం రైతు రుణ మాఫీ కూడా ఇక్కడ నుంచే మొదలుపెట్టాను. రూ.24 వేల కోట్లు మాఫీ చేశాము. 
 
డ్వాక్రా సంఘాల సృష్టికర్తను నేనే. ఒక్కొక్క సభ్యురాలికి రూ.10 వేలు ఇస్తాను. ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అక్కడే నిద్రపోయాననీ, పనులు పూర్తి చేసేందుకు పరుగెత్తిస్తున్నానని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏం తెలుసని పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు...?