Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మేం కూడా ప్రత్యేక హోదానే డిమాండ్ చేస్తున్నాం : బీజేపీ ఎంపీ హరిబాబు

తాము కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే, ప్రత్యేక హోదా ఇవ్వలేని పక్షంలో దానికి సమానమైన నిధులను ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిప

మేం కూడా ప్రత్యేక హోదానే డిమాండ్ చేస్తున్నాం : బీజేపీ ఎంపీ హరిబాబు
, మంగళవారం, 6 మార్చి 2018 (09:17 IST)
తాము కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే, ప్రత్యేక హోదా ఇవ్వలేని పక్షంలో దానికి సమానమైన నిధులను ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారని ఆయన వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు, ప్రధానమంత్రి పార్లమెంట్‌లో చేసిన ప్రకటన ద్వారా ఏపీకి లభించాల్సిన ప్రతిఫలం విషయాల గురించి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో.. ఏపీ ఆర్థికమంత్రి యనమల, కేంద్ర మంత్రి సుజనా చౌదరితో పాటు ఎంపీలు, అధికారులు మాట్లాడటం జరిగింది. 
 
ప్రధానంగా ఆర్థిక లోటు భర్తీ, ఇప్పటివరకూ ఇచ్చిన నాలుగువేల కోట్లకు అదనంగా ఎంత రాష్ట్రానికి రావాలి. అలాగే ప్రత్యేక హోదా ఇస్తే ఎలాంటి ఆర్థిక ప్రయోజనం కలుగుతుందో ఆ ప్రయోజనాన్ని పూర్తిగా కేంద్రం అందించే విషయంలో కేంద్ర ప్రాయోజిత పథకాలల్లో.. ప్రత్యేక హోదా ఇస్తే 90 శాతం నిధులు కేంద్రం ఇవ్వాల్సి ఉంటుంది. 10 శాతం నిధులు రాష్ట్రమే పెట్టుకోవాలి. హోదా లేకపోతే 60 శాతం కేంద్రం, 40 శాతం నిధులు రాష్ట్రమే పెట్టుకోవాలన్నారు. 
 
ప్రత్యేక ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించకపోయినప్పటికీ కూడా ఈ నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు ఇచ్చే విధంగా నిర్ణయిస్తామని జైట్లీ హామీ ఇచ్చారని తెలిపారు. ఈ 60, 90 శాతానికి మధ్య ఉన్న నిధులు ఏ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు వస్తాయి, ఈ నిధులన్నింటీని ఏపీకి ఎలా ఇవ్వాలనే దానిపై కూడా చర్చ జరిగిందని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ. 149కే ప్రతి ఇంటికి టీవీ, నెట్, ఫోన్... మంత్రి పల్లె ప్రకటన