Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్‌లో మరో 6 నీట్ పరీక్షా కేంద్రాలు... ఎక్కడెక్కడో తెలుసా?

అమరావతి : రాష్ట్రంలో కొత్తగా ఆరు నీట్ పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు కేంద్రాల్లో మాత్రమే నీట్ పరీక్షా కేంద్రాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో నీట్ పరీక్షా కేంద్రాలు పదికి చేరుకోనున్నాయి. ద

ఆంధ్రప్రదేశ్‌లో మరో 6 నీట్ పరీక్షా కేంద్రాలు... ఎక్కడెక్కడో తెలుసా?
, మంగళవారం, 21 నవంబరు 2017 (15:01 IST)
అమరావతి : రాష్ట్రంలో కొత్తగా ఆరు నీట్ పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు కేంద్రాల్లో మాత్రమే నీట్ పరీక్షా కేంద్రాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో నీట్ పరీక్షా కేంద్రాలు పదికి చేరుకోనున్నాయి. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో మాత్రమే నీట్ పరీక్షా కేంద్రాలు ఉండటంతో, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దీనిని గుర్తించి, తక్షణమే రాష్ట్రంలో నీట్ పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచాలని ఇటీవల కేంద్రమంత్రి జేపీ నడ్డాను కోరినట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, కొత్తగా ఆరు పరీక్షా కేంద్రాలను పెంచడానికి అంగీకరించిందని తెలిపారు. 
 
పరీక్షా కేంద్రాల పెంపుదలతో రాష్ట్రంలో వైద్య విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. కొత్తగా మంజూరు చేసిన కేంద్రాలను విజయనగరం, రాజమండ్రి, కాకినాడ, చీరాల, నెల్లూరు, కర్నూలులో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్స్‌పై ఫస్ట్ ల్యాండింగ్ టెస్ట్ సక్సెస్.. నాసా అద్భుతం...