Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ లోక్ సభ & శాసనసభ పుస్తకావిష్కరణ

Pawan Kalyan,  Marishetty Murali Kumar
, శనివారం, 5 ఆగస్టు 2023 (12:47 IST)
Pawan Kalyan, Marishetty Murali Kumar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్థానాల నుంచి, రాష్ట్రంలోని లోక్ సభ స్థానాల నుంచి 1952 నుంచి 2019 వరకూ ఎన్నికైన ప్రజా ప్రతినిధుల పేర్లు, ఫోటోలు, ఆయా స్థానాల్లో సామాజిక సమీకరణాలు, ఏ పార్టీ ఎన్నిమార్లు గెలుపు సాధించింది అనే వివరాలతో సచిత్రంగా రూపొందిన పుస్తకం 'ఆంధ్ర ప్రదేశ్ లోక్ సభ, శాసన సభలో ఎవరెవరు?'. ఈ సమాచారాన్ని  మారిశెట్టి మురళీ కుమార్ గ్రంధస్తం చేశారు. 
 
మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి పవన్ కళ్యాణ్ గారు "ముందుమాట" రాయడం విశేషం. 
 
ఈ సందర్భంగా గ్రంధకర్త  మురళీ కుమార్ ను అభినందించారు. ఈ  పుస్తకం రాజకీయాల్లో ఉన్నవారికీ...  ఈ రంగంపై ఆసక్తి ఉన్నవారికీ,  ఉపయుక్తంగా ఉంటుంది అన్నారు. ఈ పుస్తకం ఆగష్టు చివరి వారం నుండి మార్కెట్లో అందుబాటులోకి రానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త కారు కొన్నాడు.. పార్టీ ఇచ్చాడు.. తిరిగి వస్తూ..?