Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమరావతి కేసులపై ఏపీ హైకోర్టులో విచారణ.. ఘోస్ట్ క్యాపిటల్‌‌గా మార్చేశారు..

అమరావతి కేసులపై ఏపీ హైకోర్టులో విచారణ.. ఘోస్ట్ క్యాపిటల్‌‌గా మార్చేశారు..
, మంగళవారం, 16 నవంబరు 2021 (16:29 IST)
అమరావతి కేసులపై ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. పిటిషనర్స్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపిస్తున్నారు. అమరావతికి సంబంధించిన కీలక అంశాలను శ్యామ్ దివాన్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. 
 
అమరావతి కోసం రైతులు తమ జీవనోపాధిని త్యాగం చేశారని.. రాష్ట్ర రాజధాని, అభివృద్ధి కోసం వెలకట్టలేని త్యాగాలు చేశారని.. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలన్నారు. 
 
వీలైనంత త్వరగా అమరావతిని అభివృద్ధి చేయాలని.. గత ప్రభుత్వం ఇచ్చిన న్యాయబద్ధమైన హామీలను ప్రస్తుత ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. రాజకీయ విద్వేషాలతో అమరావతిని ప్రభుత్వం ఘోస్ట్ క్యాపిటల్‌గా ప్రభుత్వం మార్చేసిందని హైకోర్టులో న్యాయవాది శ్యామ్ దివాన్ దనలు వినిపించారు.
 
నవంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమైన మహా పాదయాత్ర.. మొత్తం 45 రోజులపాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా జరిగే ఈ యాత్ర డిసెంబరు 17న తిరుపతిలో ముగియనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ కేబినెట్ విస్తరణ డేట్ ఫిక్స్! ప్రశాంత్ కిషోర్ మంత్రాంగం!!