Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుస్త‌క మ‌హోత్స‌వంపై మ‌క్కువ ... గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్ కొత్త సంప్ర‌దాయం!

పుస్త‌క మ‌హోత్స‌వంపై మ‌క్కువ ... గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్ కొత్త సంప్ర‌దాయం!
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 31 డిశెంబరు 2021 (14:47 IST)
బెజ‌వాడ బుక్ ఎగ్జిబిష‌న్... విజయవాడ పుస్తకమహోత్సవం అంటే, దానికో పెద్ద చ‌రిత్ర ఉంది. ద‌శాబ్దాలుగా ప్ర‌జ‌ల‌కు విజ్ణానాన్ని పంచుతూ, పుస్త‌క విక్ర‌యాల‌ను సాగిస్తున్న సంస్థ బుక్ ఎగ్జిబిష‌న్ సొసైటీ. ఏటా జ‌న‌వ‌రి 1న ప్రారంభ‌మ‌య్యే ఈ ఎగ్జిబిష‌న్ నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్ ఐదు లక్షల రూపాయలు విడుదల చేసారు. శనివారం నుండి స్వరాజ్య మైదానంలో ఈ మహోత్సవం ప్రారంభం కానుంది. 
 
 
స్వయంగా పుస్తక ప్రేమికులైన గవర్నర్ తన విచక్షణాధికారాల మేరకు పుస్తక మహోత్సవానికి ఈ నిధులను మంజూరు చేసి నూతన సాంప్రదాయానికి నాంది పలికారని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు.  పదకొండు రోజుల పాటు పుస్తక మహోత్సవం జరగనుండగా, జనవరి ఒకటవ తేదీ సాయంత్రం వెబినార్ విధానంలో గవర్నర్ పుస్తక వేడుకను ప్రారంభించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో మొద‌లైన దోపిడీ! సినిమా టిక్కెట్ ధ‌ర రూ.295