Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంటి పైకప్పు కూలి.. నిద్రలోనే మృత్యువు ఒడిలోకి చేరిన ఆ నలుగురు

death

వరుణ్

, ఆదివారం, 4 ఆగస్టు 2024 (10:04 IST)
నంద్యాల జిల్లా చిన్నవంగలి గ్రామంలో ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. చిన్నవంగలి గ్రామంలో గురు శేఖర్ రెడ్డి (42), అతని భార్య దస్తగిరమ్మ, ఇద్దరు మైనర్ కుమార్తెలు రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఇంటి పైకప్పు కూలిపోవడంతో మృతి చెందినట్లు ఆళ్లగడ్డ సబ్ డివిజనల్ పోలీసు అధికారి షేక్ షరీఫుద్దీన్ తెలిపారు.
 
ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిద్రలోనే మృత్యువు ఒడిలోకి జారుకున్నారు. అర్ధరాత్రి పెద్ద చప్పుడు వినిపించడంతో ఇరుగుపొరుగు వారు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా కుటుంబ సభ్యులు మృతి చెందారని పోలీసులు తెలిపారు. 
 
ప్రమాదం జరిగినప్పుడు గురు శేఖర్ రెడ్డి రెండో కుమార్తె విద్యార్థిని కడప జిల్లాలో ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హిమాచల్ ప్రదేశ్ భారీ వర్షాలు- కొట్టుకుపోయిన గ్రామం.. ఆరుగురు మృతి.. 53మంది గల్లంతు