Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్!

Advertiesment
అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్!
, సోమవారం, 30 ఆగస్టు 2021 (13:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. రాష్ట్ర ప్రజల నెత్తిన మోయలేనంత రుణభారం పడింది. ఏపీ మొత్తం రుణ భారం రూ.5 లక్షల కోట్లకు చేరుకుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో కార్పొరేషన్ల అప్పే రూ.1.35 లక్షల కోట్లకు చేరింది. మిగిలినవి రూ.4 లక్షల కోట్లుగా ఉన్నాయి. 
 
ఆంధ్రప్రదేశ్‌లో అప్పులు రూ.5 లక్షల కోట్లు దాటిపోతున్నాయని ఆర్థికనిపుణులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తెచ్చిన రుణాల మొత్తం కూడా కలిపి లెక్కిస్తే అప్పు ఈ అంకెను దాటేస్తున్నట్లేనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
కార్పొరేషన్లకు సొంత వ్యాపారాలు లేకుండానే వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకుని ప్రభుత్వ అవసరాలు తీరుస్తున్నాయి. ఆ రుణాల భారం పడేది ప్రభుత్వం పైనే. ఈ లెక్కన ఇప్పటికే దాదాపు రూ.4లక్షల కోట్ల వరకు ఉన్న ప్రభుత్వ అప్పునకు కార్పొరేషన్ల ద్వారా తీసుకువచ్చిన మరో రూ.1,35,600 కోట్లు కలిపి చూడాలని విశ్లేషిస్తున్నారు. ఈ లెక్కన ప్రభుత్వ అప్పు రూ.5.35 లక్షల కోట్ల మొత్తానికి చేరుకుంటున్నట్లే భావించాల్సి వస్తుందని చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తరచూ మల్లెపూలు తెచ్చే భర్తలో మార్పు.. భార్య ఏం చేసిందంటే?