Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నవంబర్ నెలాఖరులోగా అల్పపీడనం.. తేలికపాటి వర్షాలు

Rains
, గురువారం, 24 నవంబరు 2022 (10:34 IST)
నవంబర్ నెలాఖరులోగా ఉత్తర అండమాన్‌ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడి, బలపడే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
బుధవారం ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఇటీవలే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడింది. 
 
దీనికి అనుబంధంగా సగటు సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నైరుతి వైపు వంగి ఉంది. దీని ఫలితంగా రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతి జిల్లాను ఓ రాజధానిగా అభివృద్ది చేస్తే సమస్యే ఉండదు : లక్ష్మీ నారాయణ