Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిషిత్ కారు వేగం 146 కి.మీ.. 0.5 సెకన్ల వ్యవధిలో ప్రమాదం...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పి.నారాయణ కుమారుడు కారు ప్రమాదంపై హైదరాబాద్‌ ఆర్టీఏ అధికారులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ కారు ప్రమాదానికి గురైన సమయంలో నిమిషానికి

Advertiesment
Andhra minister
, శనివారం, 27 మే 2017 (10:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పి.నారాయణ కుమారుడు కారు ప్రమాదంపై హైదరాబాద్‌ ఆర్టీఏ అధికారులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ కారు ప్రమాదానికి గురైన సమయంలో నిమిషానికి 2.46 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇటీవల హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.36లో జరిగిన కారు ప్రమాదంలో నిషిత్‌తో పాటు ఆయన స్నేహితుడు మృత్యువాతపడిన విషయం తెల్సిందే. 
 
ప్రమాదసమయంలో నిషిత్ కారును 200 పైగా కిలోమీటర్ల వేగంతో నడపడం వల్ల ప్రమాదం జరిగినట్టు భావించారు. ఈ ప్రమాదంపై అంతర్గత విచారణ చేపట్టిన ట్రాఫిక్ బృందం సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయిన వీడియో ఫుటేజీ ఆధారంగా నిషిత్ కారు వేగాన్ని ప్రాథమికంగా నిర్ధారించారు. 
 
మెట్రో పిల్లర్‌‌ నెం.8, 9 మధ్య 75 అడుగుల దూరం ఉందనీ, సాధారణంగా సీసీ కెమెరాలో సెకనుకు 24 ఫ్రేమ్స్‌ రికార్డవుతాయి. కానీ నిషిత కారు అతివేగంతో నడపటం వల్ల ప్రమాద సమయంలో 17 ఫ్రేమ్స్‌ మాత్రమే రికార్డయ్యాయి. అంటే, ఆ కారు నిమిషానికి 2.46 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు తేల్చారు. ప్రమాద సమయంలో కారు 146 కిలోమీటర్ల వేగంతో నడిపారని అంచనా వేశారు. 0.5 సెకను వ్యవధిలోనే ప్రమాదం జరిగి ఉండవచ్చనే అభిప్రాయానికి వచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్రెండ్ కోసం తల్లిదండ్రుల ప్రైవేట్ వీడియో తీసిన కుర్రోడు... షేర్ చేస్తే రూ.కోటి డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్