Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిఠాపురం కోసం అంతా చేస్తున్న పవన్ కల్యాణ్.. మినీ కాశీ కోసం..?

pawan kalyan

సెల్వి

, బుధవారం, 8 మే 2024 (15:44 IST)
జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకురాలు వంగగీతపై పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను అసెంబ్లీకి రాకుండా అడ్డుకునేందుకు వైఎస్సార్‌సీపీ సర్వశక్తులు ఒడ్డుతుండడంతో కాకినాడ జిల్లాలోని ఈ నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం హోరాహోరీ పోరు సాగనుంది.
 
తెలుగుదేశం పార్టీ (టిడిపి), భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో ఎన్నికల పొత్తును కలిగి ఉన్న పవన్ అసెంబ్లీకి రానున్న ధీమాలో వున్నారు. ఇక కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ సిట్టింగ్‌ ఎంపీ వంగ గీతను బరిలోకి దింపింది. 
 
కాకినాడ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో పిఠాపురం ఒకటి. ఇక్కడ పవన్ ఒకటిన్నర నెలలకు పైగా పిఠాపురంలో రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గానికి పరాయి వ్యక్తిగా కాకుండా.. తన రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి పవన్ కళ్యాణ్ పట్టణంలో ఇల్లు కొనుక్కొని ప్రజలకు చేరువగా ఉంటూ వారి అభివృద్ధికి కృషి చేస్తానని ప్రకటించారు. 
 
దేశంలోని 18 శక్తి పీఠాలలో ఒకటైన పురుహూతిక దేవాలయంతో పాటు పురాతన కుక్కుటేశ్వర ఆలయాన్ని ‘మినీ కాశీ’గా అభివృద్ధి చేయడంతో పాటు రూ.300 కోట్లతో నియోజకవర్గంలో ఆలయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తామని జనసేన అధినేత హామీ ఇచ్చారు. 
 
మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దాదాపు 3 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లలా కనిపిస్తారు : శామ్ పిట్రోడా