Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ నుంచి మొత్తం 11 రాజ్యసభ స్థానాలు... వైకాపా అదుర్స్

Advertiesment
ysrcp flag

సెల్వి

, శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (10:36 IST)
ఆంధ్రప్రదేశ్‌ నుంచి మొత్తం 11 రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకుని వైఎస్సార్‌సీ చరిత్ర సృష్టించింది. కొత్తగా ఎన్నికైన ముగ్గురు వైఎస్ఆర్‌సిపి సభ్యులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. 
 
ఎగువ సభలో వైఎస్ఆర్సీపీ నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 1983లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన 41 ఏళ్ల తర్వాత రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోవడం ఇదే తొలిసారి. వైఎస్సార్‌సీపీకి కొత్తగా ఎన్నికైన ముగ్గురు సభ్యులు గురువారం రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 
 
వైస్ ప్రెసిడెంట్, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ చేత ప్రమాణం చేయించారు. సుబ్బారెడ్డి, గొల్ల బాబు రావు, మేడా రఘునాథ్ రెడ్డి. సుబ్బారెడ్డి, రఘునాథ్‌లు ఆంగ్లంలో ప్రమాణం చేయగా, బాబురావు హిందీలో ప్రమాణం చేశారు.
 
కొత్త సభ్యుల చేరికతో, రాజ్యసభలో మొత్తం వైకాపా సభ్యుల సంఖ్య ఇప్పుడు 11కి చేరుకుంది, రాజ్యసభలో వైకాపా నాల్గవ అతిపెద్ద పార్టీగా అవతరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎల్ఐసీ నుంచి బుట్టా రేణుక రూ.360 కోట్ల రుణం.. ఆస్తులు వేలం