Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వక్ఫ్ బోర్డు ద్వారా దర్గాలు పీర్ల పంజాల‌కు న్యాయం చేయండి

వక్ఫ్ బోర్డు ద్వారా దర్గాలు పీర్ల పంజాల‌కు న్యాయం చేయండి
విజ‌య‌వాడ‌ , గురువారం, 23 డిశెంబరు 2021 (12:59 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు వ్యవహారంలో సరైన నిర్ణయం తీసుకొని దర్గాలు పీర్ల పంజాలు, పీర్లకు  న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కు రాష్ట్ర అహలె సున్నత్ జమాత్ కో కన్వీనర్ అల్తాఫ్ రజా విజ్ఞప్తి చేశారు. విజయవాడలో ఆయ‌న ఉప‌ముఖ్య మంత్రిని కలిసి వక్ఫ్ బోర్డు సమస్యలపై సున్ని, షీయ జమాత్ లకు న్యాయం చేయాలని కోరారు.


దర్గాలపై నమ్మకం లేనివారికి బాధ్యత ఇవ్వటం వల్ల న్యాయం జరగదని, దర్గాలకు, పీర్ల పంజాలకు సంబంధించిన సున్ని జమాత్ ల  మాషాయక్, ముత్తవల్లిలా అభిప్రాయం తీసుకోవాలన్నారు. అవసరమైతే ముఖ్యమంత్రితో తమ సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. వేల ఎకరాల వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉండి కూడా వాటికి సంబంధించిన దర్గాలు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ హక్కులు కాపాడేందుకు, ముఖ్యమంత్రికి తమ గోడు చెప్పుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు.
 
 
అల్తాఫ్ రజా విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి  ముఖ్యమంత్రితో చర్చించి పూర్తి న్యాయం చేస్తానని, తప్పకుండా తమ సమస్యలను చెప్పుకునేందుకు ముఖ్యమంత్రితో సమావేశం అవుదామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దర్గాలు, పీర్ల పంజాల సమస్యలపై నేరుగా వాటిని సందర్శించి పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తుమ‌న్నారు. ముఖ్యంగా గుంటూరు కాకాని బాజీ బాబా దర్గా, కొండపల్లి గాలిబ్ షహీద్ బాబా దర్గా షాబుఖారి బాబా దర్గాలో ఉన్న సమస్యలను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపా రోజా చెంపలు పగులుతాయ్.. జాగ్రత్త: ఉష వార్నింగ్