Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్నాటకలో నిన్న హిజాబ్ వివాదం... నేడు లౌడ్ స్పీకర్ల రచ్చ

loud speakers
, మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (12:28 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన కర్నాటకలో రోజుకో వివాదం పుట్టుకొస్తుంది. దక్షిణ భారత రాష్ట్రాల్లో బీజేపీ సంపూర్ణ మెజార్టీతో పాలన చేస్తున్న రాష్ట్రం ఇదొక్కటే. ఈ రాష్ట్రంలో ఒక వివాదం ముగిసిపోగానే మరో వివాదం తెరపైకి వస్తుంది. నిన్నమొన్నటి వరకు హిజాబ్ వివాదం దేశాన్ని ఓ కుదుపు కుదిపింది. కర్నాటక రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. 
 
ఈ నేపథ్యంలో తాజాగా లౌడ్ స్పీకర్ల వివాదం తెరపైకి వచ్చింది. ముస్లిం ప్రార్థనాలయాలైన మసీదులపై ఉన్న మైకులను తొలగించాలన్న వాదన తెరపైకి వచ్చింది. ఈ డిమాండ్‌ను మితవాదులు బలంగా వినిపిస్తున్నారు. విద్యా సంస్థల్లో హిజాబ్ వివాదం సద్దుమణిగేలోపు లౌడ్ స్పీకర్ల అంశం తెరపైకి రావడం గమనార్హం. ఈ అంశాన్ని బీజేపీ అనుబంధ సంస్థలైన భజరంగ్‌దళ్, శ్రీరామ సేనలు తెరపైకి తీసుకొచ్చాయి. 
 
మసీదుల్లో ప్రార్థనను మైకుల ద్వారా ప్రసారం చేయడాన్ని నిలిపి వేయకపోతే అవే సమయాల్లో తాము హిందూ ఆలయాల్లో ఓమ్ నవశ్శివాయ, జై శ్రీరామ్, హనుమాన్ చాలీసా, ఇతర ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రసారం చేస్తామని ఆయా సంస్థలు హెచ్చరించాయి. కాగా, ఈ వాదనకు కర్నాటక మంత్రి ఈశ్వరప్ప కూడా సానుకూలంగా స్పందించడం గమనార్హం. 
 
ఇదే అంశంపై భజరంగ్ దళ్ నేత భరత్ శెట్టి మాట్లాడుతూ, "హనుమాన్ చాలీసాను ప్రసారం చేసేందుకు ఇది పోటీ కాదు. ముస్లింలు ప్రార్థన చేసేందుకు నాకేమీ అభ్యంతరం కాదు. కానీ, అదేసమయంలో మైకుల ద్వారా ఆలయాలు, చర్చిల్లో కూడా చేస్తే అపుడు మతాల మధ్య వివాదానికి దారితీస్తుంది" అని అభిప్రాయపడ్డారు. అందువల్ల మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టినట్టు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మందుబాబులకు గుడ్ న్యూస్ఃబార్ షాప్స్ పని వేళల పొడిగింపు