Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తల్లి ఏంటీ పని? బిడ్డను గొడ్డును బాదినట్లుగా బాదుతూ..?

తల్లి ఏంటీ పని? బిడ్డను గొడ్డును బాదినట్లుగా బాదుతూ..?
, సోమవారం, 30 ఆగస్టు 2021 (17:19 IST)
తల్లి సైకోగా మారింది. చిన్న బిడ్డను అతి క్రూరంగా కొడుతూ కనిపించింది. తమిళనాడులో ఈ ఘటన కలకలం రేపుతోంది. మాతృత్వానికి మచ్చ తెచ్చిన ఈ ఘటనపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.
 
తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లాలోని సత్యమంగళం మండలం మెట్టూరు గ్రామానికి చెందిన వడివేళన్‌కి, చిత్తూరు జిల్లా రాంపల్లికి చెందిన తులిసికి వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ళ గోకుల్, రెండేళ్ళ ప్రదీప్ ఇద్దరు పిల్లలున్నారు. 
 
భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. గొడవల కారణంగా పిల్లలను హింసిస్తూ ఉండేది తులసి. అంతేకాదు చిన్నపిల్లలను ఎలా కొడుతూ పైశాచికం ఆనందంతో పొందుతుందో ఆమె తన సెల్ ఫోన్లో తీసి అందరికీ పంపించేది. ఇది కాస్త వైరల్‌గా మారింది.
 
తులసి వీడియోలు బయటకు రావడంతో పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె పరారైంది. చిన్నారులను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేస్తున్నారు. తులసి తన స్వగ్రామంలోనే వున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎంపీలో దారుణం : ట్రక్కుకు కాళ్లను కట్టేసి ఈడ్చుకెళ్లారు...